దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐఐటి జేఈఈ మెయిన్స్ సెషన్ -1 లో సర్పవరం బ్రాంచ్ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు 5 మందికి పైగా 95 % పర్సంటేజ్ సాధించారు
6th sense TV:కాకినాడ జిల్లా,
కాకినాడ,
కేకేఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థి రామ్ చరణ్ 98.46 % పర్సంటేజ్ సాధించగా, విద్యార్థిని లక్ష్మీ ప్రియ 96.99 % పర్సంటేజ్ సాధించారని కేకెఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కే. కోటేశ్వరరావు తెలిపారు.
ఇంతటి ఘన విజయానికి కారణం కేకేఆర్ విద్యాసంస్థల్లో నిర్వహించబడే ఫ్యాక్ట్ ప్రోగ్రాం కారణమని, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే ఏం పీ సీ ( MPC) స్టాఫ్ కు ఆ ఘనత దక్కుతుందని ఆయన చెప్పారు.
ఈ ఘనత సాధించిన విద్యార్థులను ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను , సిబ్బందిని డైరెక్టర్ శ్రీ అవినాష్,రాజమండ్రి జోన్ డీన్ శ్రీ కిషోర్, ప్రిన్సిపల్ దాదాజీ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ శ్రీ పిఎన్ఆర్ ఇతర సిబ్బంది అభినందించారు…..