ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే ద్వారంపూడి…

ఓ ఎన్ జి సి పరిహారం, నిరసన ఉద్యమంపై చర్చ

6th sense TV:కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సీఎంతో చర్చించారు. ముఖ్యంగా ఓ ఎన్ జి సి కార్యకలాపాల కారణంగా ఇబ్బందులు పడుతున్న మత్స్యకారుల సమస్యలను ఎమ్మెల్యే ద్వారంపూడి సీఎం దృష్టికి తీసుకువచ్చారు. నష్టపరిహారం కోసం మత్స్యకారులంతా శాంతియుత పోరాటం చేస్తున్న విధానాన్ని వివరించారు. ఓ ఎన్ జి సి, రిలయన్స్ వంటి సంస్థల వల్ల ఉపాధిని కోల్పోతున్న మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన ఆవశ్యకతను, ఉద్యమాన్ని ఆయన సీఎంకు వివరించారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, మత్స్యకారులకు న్యాయం చేసేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి తెలిపారు.

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఆంధ్రప్రదేశ్

Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి.. అందుకే కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందంటూ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ
ఆంధ్రప్రదేశ్ కాకినాడ పాలిటిక్స్

కాకినాడ సిటీ నియోజవర్గం నుండి మహానాడు కు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన వనమాడి కొండబాబు పసుపు సైన్యం

6త్ సెన్స్ టీవీ కాకినాడ రిపోర్టర్; బస్సులు, కార్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ సిటీ నియోజకవర్గం ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కళాకారునిగా